విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
- October 25, 2020విజయవాడ:ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేంద్రం పేదలకు అండగా నిలిచిందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట.. రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కల్గించాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు