దసరా పండుగ అందరికి విజయాలు చేకూర్చాలి:సీపీ మహేష్ భగవత్
- October 25, 2020హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ రోజు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అంబేర్ పేట హెడ్ క్వార్టర్ లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవాన్ని అంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ ప్రజాభిమనం పొందుతూ వారి మన్ననలందుకునేలా పని చేస్తూ పోలీసుల గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా పని చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శిలపవల్లి, అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, శమీర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్