ఒక్క ఉంగరంలో 7,801 వజ్రాలు
- October 25, 2020
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు.ఒక్క ఉంగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7,801 డైమండ్స్ ని పొదిగారు. దీంతో ఆ రింగ్ గిన్నీస్ వాల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది.ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 'ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం' పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. ఈ పుష్పాన్ని ఆ వ్యాపారి అరుదుగా దొరికే బ్రహ్మ కమలాన్ని మోడల్ గా తీసుకుని రూపొందించారు.అయితే ఆ రింగ్ ను గత నెలలోనే ఆవిష్కరించారు.
మొదట ఈ ఉంగరాన్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్ను 2018 సెప్టెంబర్లో రూపొందించారు. కేవలం ప్లానింగ్కే 45 రోజుల సమయం పట్టింది. అప్పుడు అది కేవలం పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే. ఆ తర్వాత ఉంగరం తయారు చేసే పని మొదలుపెట్టారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది. ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టగా గతేడాది ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని మొదలైంది. ఈ ఉంగరం ఆరు లేయర్స్తో ఉంటుంది. ప్రతీ లేయర్లో 8 రేకులు ఉంటాయి. మొత్తం ఉంగరంలో 7801 వజ్రాలున్నాయి. అయితే ఈ ఉంగరం పూర్తిగా తయారైన తరువాత దాన్ని గత ఏడాది గిన్నీస్ వాల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. కాగా ఆ ఉంగరాన్ని అనేక రౌండ్లు వెరిఫికేషన్ చేసి డైమండ్స్ పొదిగిన ఉంగరాన్ని గిన్నీస్ రికార్డ్ లో చేర్చారు.

తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







