ఒక్క ఉంగరంలో 7,801 వజ్రాలు
- October 25, 2020హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు.ఒక్క ఉంగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7,801 డైమండ్స్ ని పొదిగారు. దీంతో ఆ రింగ్ గిన్నీస్ వాల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది.ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 'ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం' పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. ఈ పుష్పాన్ని ఆ వ్యాపారి అరుదుగా దొరికే బ్రహ్మ కమలాన్ని మోడల్ గా తీసుకుని రూపొందించారు.అయితే ఆ రింగ్ ను గత నెలలోనే ఆవిష్కరించారు.
మొదట ఈ ఉంగరాన్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్ను 2018 సెప్టెంబర్లో రూపొందించారు. కేవలం ప్లానింగ్కే 45 రోజుల సమయం పట్టింది. అప్పుడు అది కేవలం పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే. ఆ తర్వాత ఉంగరం తయారు చేసే పని మొదలుపెట్టారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది. ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టగా గతేడాది ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని మొదలైంది. ఈ ఉంగరం ఆరు లేయర్స్తో ఉంటుంది. ప్రతీ లేయర్లో 8 రేకులు ఉంటాయి. మొత్తం ఉంగరంలో 7801 వజ్రాలున్నాయి. అయితే ఈ ఉంగరం పూర్తిగా తయారైన తరువాత దాన్ని గత ఏడాది గిన్నీస్ వాల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. కాగా ఆ ఉంగరాన్ని అనేక రౌండ్లు వెరిఫికేషన్ చేసి డైమండ్స్ పొదిగిన ఉంగరాన్ని గిన్నీస్ రికార్డ్ లో చేర్చారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ