ప్రవాస భారతీయుల పాస్ పోర్టులో యూఏఈ చిరునామా చేర్చుకునేందుకు అవకాశం
- October 28, 2020
యూఏఈ:యూఏఈతో సహా ప్రపంచంలోని ఏ దేశంలోని చిరునామాతోనైనా ప్రవాస భారతీయులు పాస్ పోర్టు పొందే అవకాశం ఉందని దుబాయ్ లోని దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. యూఏఈలో కొన్నేళ్లుగా ఉంటున్న ఎన్ఆర్ఐలు తాము ఉంటున్న చిరునామాతోనే పాస్ పోర్టు పొందెందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇండియన్ పాస్ పోర్టు స్థానంలో కొత్త అడ్రస్ తో పాస్ పోర్టు పొందాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు అందరూ కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కోసం EWA/FEWA,SEWA బిల్లులను దరఖాస్తులో జతపరచాల్సి ఉంటుంది. అలాగే టెలిఫోన్ బిల్లులు, అద్దె ఒప్పందాల డాక్యుమెంట్, టైటిల్ డీడ్ లను కూడా అడ్రస్ ప్రూఫ్ గా ఆమోదించనున్నట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. అయితే..యూఏఈలోని అడ్రస్ తో పాస్ పోర్టులు పొందెందుకు ఏడాది కాలంగా తమ కార్యాలయానికి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని, ప్రతి రోజు పది నుంచి పన్నెండు వరకు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







