ప్రవాస భారతీయుల పాస్ పోర్టులో యూఏఈ చిరునామా చేర్చుకునేందుకు అవకాశం

- October 28, 2020 , by Maagulf
ప్రవాస భారతీయుల పాస్ పోర్టులో యూఏఈ చిరునామా చేర్చుకునేందుకు అవకాశం

యూఏఈ:యూఏఈతో సహా ప్రపంచంలోని ఏ దేశంలోని చిరునామాతోనైనా ప్రవాస భారతీయులు పాస్ పోర్టు పొందే అవకాశం ఉందని దుబాయ్ లోని దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. యూఏఈలో కొన్నేళ్లుగా ఉంటున్న ఎన్ఆర్ఐలు తాము ఉంటున్న చిరునామాతోనే పాస్ పోర్టు పొందెందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇండియన్ పాస్ పోర్టు స్థానంలో కొత్త అడ్రస్ తో పాస్ పోర్టు పొందాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు అందరూ కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కోసం EWA/FEWA,SEWA బిల్లులను దరఖాస్తులో జతపరచాల్సి ఉంటుంది. అలాగే టెలిఫోన్ బిల్లులు, అద్దె ఒప్పందాల డాక్యుమెంట్, టైటిల్ డీడ్ లను కూడా అడ్రస్ ప్రూఫ్ గా ఆమోదించనున్నట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. అయితే..యూఏఈలోని అడ్రస్ తో పాస్ పోర్టులు పొందెందుకు ఏడాది కాలంగా తమ కార్యాలయానికి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని, ప్రతి రోజు పది నుంచి పన్నెండు వరకు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com