వీసా మరియు ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌పై ఇండియా గైడ్‌ లైన్స్‌

- October 28, 2020 , by Maagulf
వీసా మరియు ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌పై ఇండియా గైడ్‌ లైన్స్‌

కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో వీసా మరియు ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌కి సంబంధించి భారత ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది.వందే భారత్‌ మిషన్‌ లేదా ఎయిర్‌ బబుల్‌ విధానం ద్వారా నాన్‌ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాలకు సంబంధించి ఈ గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆరిజన్‌ పర్సన్స్‌ కార్డ్‌ హోల్డర్స్‌, ఏ దేశం పాస్‌పోర్ట్‌ని కలిగి వున్నా వారు అర్హులే అవుతారు. టూరిస్ట్‌ వీసాపై కాకుండా ఇతత్రా అవసరాల నిమిత్తం భారతదేశంలో పర్యటించాలనుకునే ఫారిన్‌ నేషనల్స్‌ కూడా అర్హులే. ఎలక్ట్రానిక్‌ వీసా (ఇ-వీసా), టూరిస్ట్‌ వీసా మరియు మెడికల్‌ వీసా తప్ప అన్ని ఎగ్జిస్టింగ్‌ వీసాస్‌ చెల్లుబాటవుతాయి. నేపాల్‌, భూటాన్‌ పౌరులు ఏ దేశం నుంచి అయినా ఇండియాకి రావొచ్చు. క్వారంటైన్‌ సహా ఇతర హెల్త్‌ / కోవిడ్‌ 19 నిబంధనల్ని ప్రయాణీకులు తప్పక పాటించాల్సి వుంటుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com