మస్కట్:నిబంధనలు ఉల్లంఘించిన కార్మికుల భర్తీ కార్యాలయం మూసివేత
- October 28, 2020
మస్కట్:గృహ కార్మికులను భర్తీ చేసే కార్యాలయం...తమ వినియోగదారులను మోసం చేస్తుండటంతో ఆ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయాల్సిందిగా సీబ్ కోర్టు ఆదేశించింది. వినియోగదారుల భద్రత చట్టం మేరకు ఈ తీర్పు ఇచ్చినట్లు కోర్టు వెల్లడించింది. అంతేకాదు..దోషిగా తేలిన సదరు రిక్రూట్మెంట్ కంపెనీకి RO2000 జరిమానా విధించింది. డొమస్టిక్ వర్కర్లను రిక్రూట్ చేసుకునే సమయంలో నిబంధనల ఉల్లంఘన...అలాగే తమతో కుదర్చుకున్న కాంట్రాక్ట్ విషయంలోనూ హామీలను నెరవేర్చటంలో సదరు కంపెనీ విఫలం అయ్యిందనేది వినియోగదారుల ఆరోపణ. అంతేకాదు..కాంట్రాక్ట్ హామీలపై కంపెనీ నిర్వహకులను సంప్రదించేందుకు ప్రయత్నించినా సరైన తీరులో స్పందించకపోవటంతో విషయం కోర్టు వరకు చేరింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం సదరు రిక్రూట్మెంట్ కంపెనీ నియోగదారుల భద్రత చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించి..కంపెనీపై శాశ్వత నిషేధం, RO2000 జరిమానా విధించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







