దుబాయ్:ఈ వారంతంలోనూ అల్ షిందాఖా సొరంగ మార్గం మూసివేత
- October 30, 2020
దుబాయ్:దుబాయ్ లోని అల్ షిందాఖా సొరంగ మార్గం తాత్కాలిక మూసివేత ఈ వారంలో కూడా కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఈ సొరంగ మార్గాన్ని కొన్నాళ్లుగా వారంలో రెండు రోజులు మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంతంలోనూ సొరంగ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 10.30 వరకు, తిరిగి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 8 గంటల వరకు టన్నెల్ రోడ్డును మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ మక్తూమ్ బ్రిడ్జి, అల్ గర్హౌడ్ బ్రిడ్జి రోడ్డును ప్రత్యామ్నాయ రహదారిగా వినియోగించుకోవాలని ఆర్టీఏ సూచించింది. సొరంగ మార్గం మూసివేతతో X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 రూట్లో వెళ్లే బస్సులు ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష