దుబాయ్:ఈ వారంతంలోనూ అల్ షిందాఖా సొరంగ మార్గం మూసివేత
- October 30, 2020
దుబాయ్:దుబాయ్ లోని అల్ షిందాఖా సొరంగ మార్గం తాత్కాలిక మూసివేత ఈ వారంలో కూడా కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఈ సొరంగ మార్గాన్ని కొన్నాళ్లుగా వారంలో రెండు రోజులు మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంతంలోనూ సొరంగ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 10.30 వరకు, తిరిగి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 8 గంటల వరకు టన్నెల్ రోడ్డును మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ మక్తూమ్ బ్రిడ్జి, అల్ గర్హౌడ్ బ్రిడ్జి రోడ్డును ప్రత్యామ్నాయ రహదారిగా వినియోగించుకోవాలని ఆర్టీఏ సూచించింది. సొరంగ మార్గం మూసివేతతో X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 రూట్లో వెళ్లే బస్సులు ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!







