కోవిడ్ 19: ఖతార్ లో కొత్తగా 193 పాజిటివ్ కేసులు..225 మంది రికవరీ

- October 30, 2020 , by Maagulf
కోవిడ్ 19: ఖతార్ లో కొత్తగా 193 పాజిటివ్ కేసులు..225 మంది రికవరీ

ఖతార్ లో కొత్తగా మరో 193 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 9971 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 193 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఖతార్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..దేశంలో రోజు రోజుకీ రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఊరట కలిగించే అంశం. 24 గంటల వ్యవధిలో 225 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ నుంచి రికవరి అయిన వారి సంఖ్య 1,29,349కి పెరిగింది. ఇదిలాఉంటే..24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 232కి పెరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com