26కు చేరిన టర్కీ భూకంప మృతులు
- October 31, 2020
అంకారా: టర్కీ, గ్రీస్ను భారీ భూకంపం కుదిపేసింది. టర్కీలో భూకంపం వల్ల మరణించినవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. నిన్న 14 మంది చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరింది. భూకంపం కారణంగా 800 మందికిపైగా గాయపడ్డారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.0గా నమోదయ్యింది. దీని ప్రభావంతో సామోస్, ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ వచ్చింది. టర్కీలోని ఇజ్మిర్లో 20కిపైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉన్నది.
ఇజ్మిర్ తీరప్రాంతంలోని సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. గ్రీస్ ద్వీపం సామోస్కు సమీపంలో 13 కి.మీ. లోతులో భూపంక కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ ప్రకటించింది. గతంలో టర్కీలో భారీగా భూకంపాలు సంభవించాయి. ఈ ఏడాది జనవరిలో ఇలాజిగ్ ప్రావిన్సులో సంభవించిన భూకంపంలో 30 మందికిపైగా మృతి చెందారు. 1600 మందికి పైగా గాయపడ్డారు. 1999లో ఇస్తాంబుల్ సమీపంలోని ఇజ్మిట్ నగరంలో వచ్చిన భూకంపంలో సుమారు 17 వేలమంది కన్నుమూశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







