మస్కట్:కంప్యూటర్ స్టోర్స్ పై నిరంతర పర్యవేక్షణ..
- October 31, 2020
మస్కట్:దేశంలో కంప్యూటర్ల కృత్రిమ కొరతకు తావు లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఒమన్ లోని వినియోగదారుల భద్రత అధికార విభాగం స్పష్టం చేసింది. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలను కంప్యూటర్లు, విడిభాగాలను అమ్మాలని కక్కుర్తికి పోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దేశంలో కంప్యూటర్ల లభ్యత, అన్ని వర్గాల ప్రజలకు వాటి ధరలు అందుబాటులో ఉన్నాయా..లేదా నిర్ధారించుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కంప్యూటర్ స్టోర్స్ లలో తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మస్కట్ లోని పలు కంప్యూటర్ స్టోర్స్ లో కంప్యూటర్స్, విడిభాగాల స్టాక్ ను పరిశీలించి..వాటి ధరలు సహేతుకంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. కోవిడ్ 19 పరిణామాల తర్వాత ఆన్ లైన్ ద్వారా ఆఫీస్ పనులు నిర్వహించటం, ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం పెరిగింది. దీంతో కంప్యూటర్లకు, వాటి విడిభాగాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కంప్యూటర్ స్టోర్స్ నిర్వాహకులు కంప్యూటర్లకు కృత్రిక కొరత సృష్టించి..వాటిని అధిక ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు. దీంతో కంప్యూటర్ ధరలను నియంత్రించేందుకు వినియోగదారుల భద్రత విభాగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







