మహిళల IPL టైటిల్ స్పాన్సర్ గా జియో...
- November 01, 2020
యూఏఈ:ప్రస్తుతం జరుగుతున్న పురుషుల IPL 2020 చివర్లో అంటే నవంబర్ 4 నుండి 9 వరకు మహిళల IPL నిర్వహించనున్నట్లు ఈ మధ్యే BCCI ప్రకటించింది. ఈ లీగ్ కోసం యూఏఈ కి వెళ్లిన మహిళా ప్లేయర్స్ కి అక్కడ తమ క్వారంటైన్ ను కూడా ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ఏడాది మహిళల టీ 20 ఛాలెంజ్ కు రిలయన్స్ జియో టైటిల్ స్పాన్సర్ గా వ్యవరించనుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ లీగ్ కోసం బీసీసీఐ ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ ఈ ఏడాది ఇలా మహిళల IPL టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం ప్రత్యేకంగా BCCI ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో BCCI కుదుర్చుకున్న ఈ ఒప్పందం దానిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది అనే చెప్పాలి. అయితే నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ ట్రైల్బ్లేజర్స్, సూపర్నోవాస్ మరియు వెలాసిటీ అనే మూడు జట్ల మధ్య జరుగుతుంది. ఇందులో వెలాసిటీకి మిథాలీ రాజ్ నాయకత్వం వహించగా, స్మృతి మంధనా, హర్మన్ప్రీత్ కౌర్ వరుసగా ట్రైల్బ్లేజర్స్, సూపర్నోవాస్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ లీగ్ లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే ఉండటంతో వాటిని షార్జాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







