అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..
- February 15, 2016
రాజకీయాలకతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేటలో మోడల్ బంజారా భవన్ను నిర్మిస్తామని తెలిపారు. వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి ఎంత ఆదర్శంగా ఉందో మనం తలుచుకుంటే సిరిసిల్ల నియోజకవర్గాన్ని అంత ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు అని చెప్పారు. ప్రతి గ్రామం, ప్రతి తండాలో అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే పన్ను వసూళ్లలో సిరిసిల్ల ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. కరెంట్ కోతలు లేకుండా ప్రతి రెండు గ్రామాలకు సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు. అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెనకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వర్షాలు కురవాలని మనమంతా దేవుడిని ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







