కువైట్: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
- November 03, 2020
కువైట్ సిటీ:సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పోస్టు చేసిన వ్యక్తిని కువైట్ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు అదుపులోకి తసుకున్నారు. నిందితుడు పోస్టు చేసిన పోస్టింగ్స్ ప్రజా నైతిక విలువలకు విరుద్ధంగా..అసభ్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అకౌంట్ హోల్డర్ కు సమన్లు పంపి అతన్ని అతన్ని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగానికి కేసును బదిలీ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అభ్యంతరక ప్రచారం చేపట్టినా..అసభ్య పోస్టింగులు పెట్టిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర సంబంధాలు, సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరించారు. నైతిక విలువలకు కట్టుబడకుండా ఉండే పోస్టింగ్ లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా..వెబ్ సైట్ లో ప్రచురితమైనా...వాటిని గుర్తించేందుకు తాము నిరంతరం నిఘా కొనసాగిస్తామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







