బాధిత ఇండియన్స్ కోసం వెల్ఫేర్ సెంటర్ ఇప్పుడు మరింత అందుబాటులో
- November 03, 2020
దుబాయ్: వీసా గడువు ముగిసిన/ఉద్యోగం కోల్పోయిన/మానసిక ఒత్తిడి కి లోనైన వంటి వివిధ కారణాలచేత బాధపడుతున్న బ్లూ కాలర్ వర్కర్స్ని ఆదుకోవడం తమ ప్రధాన అజెండా అని దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ అమన్ పురి చెప్పారు. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రం (పీబీఎస్కె) ను ఇండియన్ కాన్సులేట్ లో ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. 'పీబీఎస్కె' ను జుమైరా లేక్ టవర్స్ నుంచి భారత కాన్సులేట్ ను మార్చగా, ఈ కార్యాలయాన్ని భారత రాయబారి పవన్ కపూర్ ప్రారంభించారు.


జెఎల్టిలో వున్న ఫెసిలిటీ, ఇండియన్ వర్కర్స్కి అంత కన్వీనియంట్గా లేదనీ, రీలొకేట్ చేశాక అందరికీ అది అందుబాటులో వుంటుందని భావిస్తున్నామని కపూర్ పేర్కొన్నారు. 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ హాట్లైన్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ఏడుగురు లాయర్లతో కూడిన ప్యానెల్ వర్కర్స్కి ఉపయుక్తంగా వుంటుందని అన్నారు. పిబిఎస్కె, 8 వేల డిస్ట్రెస్ కాల్స్ని ప్రతి నెలా కోవిడ్ కి ముందు రిసీవ్ చేసుకునేది. కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 3 వేల నుంచి 3 వేల 500కి తగ్గింది. సైకలాజికల్ మరియు గ్రీవెన్స్ కౌన్సిలర్స్తో ప్రత్యేకమైన ప్యానెల్ కూడా అందుబాటులో వుంచుతున్నారు. కొత్త పిబిఎస్కె ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచా సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలీడేస్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు అందుబాటులో వుంటుంది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం అలాగే మలయాళం భాషల్లో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో వుంటుంది.

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







