ఖతార్ చేరుకున్న ప్రయాణికుల్లో 53 మందికి కరోనా పాజిటివ్

- November 03, 2020 , by Maagulf
ఖతార్ చేరుకున్న ప్రయాణికుల్లో 53 మందికి కరోనా పాజిటివ్

ఖతార్ లో కొత్తగా 226 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 24 గంటల వ్యవధిలోనే 206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కొత్తగా నమోదైన 226 పాజిటివ్ కేసులో 173 కేసులు కమ్యూనిటీ కేసులు కాగా..53 మంది విదేశాల నుంచి ఖతార్ తిరిగి వచ్చిన వారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి నేటి వరకు 232 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కొల్పోయారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com