కువైట్ ను వణికిస్తున్న వైరస్..కొత్తగా 787 కరోనా కేసులు నమోదు
- November 03, 2020
కువైట్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలకు సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో..కువైట్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 787 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,28,080కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందటంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 789కి పెరిగింది. అయితే..కరోనా కేసుల తీవ్రతతో పాటు...రికవరి రేటు కూడా పెరుగుతుండటం కొంత మేర ఆశాజనకంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 694 మంది కోలుకున్నారు. ఓవరాల్ గా ఇప్పటివరకు 1,19.080 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 8,211 కరోనా పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







