కార్ ప్రమాదం తర్వాత మక్కా మసీదు దారిలో సెక్యూరిటీ పెంపు
- November 03, 2020
సౌదీ: మక్కా మసీదులో కారు ప్రమాదం తర్వాత..పవిత్ర మసీదు వైపు వెళ్లే అన్ని దారుల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు అధికారులు. పవిత్ర మక్కా మసీదు వైపు వెళ్లే దారుల్లో బారికెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. గత శుక్రవారం ఓ కారు అదుపు తప్పి మక్కా మసీదు ద్వారాన్ని ఢికొట్టిన విషయం తెలిసిందే. అతన్ని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది..ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ అసాధారణ స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. ఇకపై పవిత్ర మసీదు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..వాహనాలు మసీదు వైపు దూసుకు రాకుండా బారికెడ్లు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే..నడుచుకుంటూ మసీదుకు వచ్చే బక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







