ఖమ్మం చేరుకున్నకేసీఆర్
- February 15, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో ఖమ్మం చేరుకున్న కేసీఆర్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ తర్వాత తుమ్మలతో కలిసి పట్టణ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ నూతన బస్టాండ్, ట్యాంక్బండ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రమణ గుట్ట వికలాంగుల కాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డులో సీఎం కాన్వాయ్ను అడ్డుకోబోయిన పీడీఎస్యూ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు, శ్రీరామదాసు ప్రాజెక్టులకు మంగళవారం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటాని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







