ఖమ్మం చేరుకున్నకేసీఆర్‌

- February 15, 2016 , by Maagulf
ఖమ్మం చేరుకున్నకేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం చేరుకున్న కేసీఆర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ తర్వాత తుమ్మలతో కలిసి పట్టణ పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌ నూతన బస్టాండ్‌, ట్యాంక్‌బండ్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రమణ గుట్ట వికలాంగుల కాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బైపాస్‌ రోడ్డులో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన పీడీఎస్‌యూ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు, శ్రీరామదాసు ప్రాజెక్టులకు మంగళవారం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటాని ఆయన స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com