రెండో పెళ్లి చేసుకున్న నటుడు సామ్రాట్.. హాజరైన తనీష్, దీప్తి సునయన
- November 05, 2020
ఈ ఏడాది టాలీవుడ్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇన్నాళ్లూ సింగిల్గా లైఫ్ కొనసాగించేస్తున్న హీరోలు, సహనటులు, హీరోయిన్లు, దర్శకులు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బిగ్బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్బాస్-2 కంటెస్టెంట్స్.. తనీష్, దీప్తి సునయన కూడా ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!