లుసైల్ సిటీలో తొలి సూపర్ మార్కెట్ని ప్రారంభించిన లులు
- November 05, 2020
కతార్: లులు హైపర్ మార్కెట్, తన 14వ స్టోర్ని లుసైల్ సిటీలోని ది ఎయిటీన్ టవర్ మరీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఏడాది చివరి నాటికి మరో ఐదు లులు ఔట్లెట్స్ అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ప్రారంభించిన స్టోర్ విషయానికొస్తే, దీంట్లో 2,000 చదరపు మీటర్ల వైశాల్యంలో వినియోగదారులకు అత్యద్భుతమైన షాపింగ్ అనుభూతి లభించనుంది. ఈ ఎక్స్ప్రెస్ స్టోర్లో యాంపిల్ పార్క్ ఫెసిలిటీ వుంది. ఈ కొత్త స్టోర్ ప్రారంభోత్సవానికి పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ గ్రూప్ ఛైర్మన్ మౌతాజ్ అల్ ఖయ్యాత్, వైస్ ఛైర్మన్ మరియు గ్రూప్ సీఈఓ రమెజ్ అల్ ఖయ్యాత్, జస్ట్ రియల్ ఎస్టేట్ ఛైర్మన్ నాజర్ అల్ అన్సారీ, లులు హైపర్ మార్కెట్స్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ తదితరులు హాజరయ్యారు. కోవిడ్ -9 పాండమిక్ నేపథ్యంలో లులు తనదైన పాత్ర పోషించిందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తమ స్టోర్లు వినియోగదారులకు అందుబాటులో వున్నాయని లులు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







