దుబాయ్ మాల్స్లో కోవిడ్ టెస్టింగ్ స్టేషన్స్ వేళల మార్పు
- November 05, 2020
దుబాయ్: దుబాయ్ హెల్త్ అథారిటీ, పిసిఆర్ కోవిడ్ 19 స్టేషన్స్ మయాన్ని మార్చడం జరిగింది. మాల్స్లోని టెస్టింగ్ స్టేషన్స్కి సంబంధించి ఈ మార్పులు జరిగాయి. మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డీరాలలోని పీసీఆర్ టెస్టింగ్ స్టేషన్స్ వాక్ ఇన్ బేసిస్లో ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలున్నవారు ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇది కేవలం నాన్ మెడికల్ అవసరాల నిమిత్తం, ట్రావెల్ సంబంధిత అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయబడిన టెస్టింగ్ సెంటర్. కాగా, ప్రతి టెస్టింగ్ సెంటర్లో రోజుకి 180 టెస్టులు చేసే అవకాశం వుంది. పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ కోసం 150 దిర్హాములు చెల్లించాల్సి వుంటుంది. 24 గంటల్లో రిపోర్ట్ సంబంధిత వ్యక్తికి అందుతుంది.
తాజా వార్తలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!









