చాక్టెట్ కవర్లలో బంగారం..కోల్ కతా కస్టమ్స్ ఆఫీసర్లకు దొరికిపోయిన ప్రయాణికుడు

- November 06, 2020 , by Maagulf
చాక్టెట్ కవర్లలో బంగారం..కోల్ కతా కస్టమ్స్ ఆఫీసర్లకు దొరికిపోయిన ప్రయాణికుడు

కోల్ కతా:పలు దేశాల నుంచి భారత్ లోని వివిధ విమనాశ్రాయాల ద్వారా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇప్పటికే చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే..దక్షిణాది రాష్ట్రలకు చెందిన విమానాశ్రయాల్లోనే బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తు పట్టుబడిన ఘటనలు బయటపడ్డాయి. లేటెస్ట్ కోల్ కతాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నేతాజి సుభాష్ చంద్ర‌బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో చాక్లెట్ క‌వ‌ర్ల‌లో దాచిపెట్టి ఉంచి 531.20 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ. 27,62,240 ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. బంగారం క‌లిగి ఉన్న ప్ర‌యాణికుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే..ఆ ప్రయాణికుడు ఎక్కడి నుంచి కోల్ కతాకు చేరుకున్నాడనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com