కువైట్ లో మళ్లీ తీవ్రమవుతున్న కరోనా

- November 06, 2020 , by Maagulf
కువైట్ లో మళ్లీ తీవ్రమవుతున్న కరోనా

కువైట్ సిటీ:ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న వేళ..కువైట్ లో వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. దేశంలో కొత్తగా 825 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ
అధికారులు వెల్లడించారు. వైరస్ కారణంగా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 804కి పెరిగింది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.30,463కి చేరింది. ప్రస్తుతం 8,396 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో 115 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com