ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ తో జనవరి నుంచి ఆర్ కె ఇంటెర్నేషనల్ చిత్రం 'కలియుగం'
- November 06, 2020
హైదరాబాద్:హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలో తన స్పెల్-బైండింగ్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్, ప్రస్తుతం "కలియుగం" అనే తెలుగు, తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ "నేను కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలనీ ,అంత గొప్ప కథ ఇది అని, నాలాంటి ఒక నటికీ ఇలాంటి పాత్ర పోషించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని, అంతేకాక ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక ఫ్రెష్ కథతో ఒక గొప్ప సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను "ఆర్ కె ఇంటెర్నేషనల్" బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మిగతా నటీనటులు టెక్నీకల్ టీమ్ విషయాలు అతి త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!