వినియోగదారుల రద్దీని తట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ గడువును పొడిగంచిన సౌదీ
- November 07, 2020
సౌదీ:షాపింగ్ మాల్స్ లో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. పరిమితి సమయ వేళలతో షాపింగ్ మాల్స్ సీజన్ సేల్స్ కు విపరీతమైన గిరాకీ ఉంటోంది. దీంతో సీజనల్ సేల్స్ గడవును పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజనల్ సేల్స్ గడువు పెంచటం ద్వారా మాల్స్ లో వినియోగదారుల రద్దీని నియంత్రించొచ్చని మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంతేకాదు..ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా వార్షిక అమ్మకాల లోటును కూడా అదనపు గడువు ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది. ఇదిలాఉంటే..షాపింగ్ మాల్స్ లో కోవిడ్ 19 నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాలని మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరించింది. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ట్రాలీలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే SR10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వినియోగదారులు, మాల్స్ సిబ్బందికి ఎంట్రన్స్ దగ్గరే టెంపరేచర్ చెక్ చేయాలని పేర్కొంది. మాల్స్ లోగానీ, వెలుపలగానీ జనం గుమికూడకుండా చూసుకోవాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 మందికి మించకూడదని వెల్లడించింది. ఈ నిబంధనల్లో ఉల్లంఘనకు పాల్పడితే R50,000 జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
- టీవీకే ఆధిక్యం..విజయ్ ఇంట్లో మిన్నంటిన సంబరాలు!
- ఐపీఎల్ 2026..టాప్ 4 జట్లకు గట్టి పోటీ!
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!









