వినియోగదారుల రద్దీని తట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ గడువును పొడిగంచిన సౌదీ
- November 07, 2020
సౌదీ:షాపింగ్ మాల్స్ లో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. పరిమితి సమయ వేళలతో షాపింగ్ మాల్స్ సీజన్ సేల్స్ కు విపరీతమైన గిరాకీ ఉంటోంది. దీంతో సీజనల్ సేల్స్ గడవును పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజనల్ సేల్స్ గడువు పెంచటం ద్వారా మాల్స్ లో వినియోగదారుల రద్దీని నియంత్రించొచ్చని మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంతేకాదు..ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా వార్షిక అమ్మకాల లోటును కూడా అదనపు గడువు ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది. ఇదిలాఉంటే..షాపింగ్ మాల్స్ లో కోవిడ్ 19 నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాలని మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరించింది. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ట్రాలీలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే SR10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వినియోగదారులు, మాల్స్ సిబ్బందికి ఎంట్రన్స్ దగ్గరే టెంపరేచర్ చెక్ చేయాలని పేర్కొంది. మాల్స్ లోగానీ, వెలుపలగానీ జనం గుమికూడకుండా చూసుకోవాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 మందికి మించకూడదని వెల్లడించింది. ఈ నిబంధనల్లో ఉల్లంఘనకు పాల్పడితే R50,000 జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!