ఇల్లీగల్స్పై పాలసీకి సంబంధించి చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్
- November 09, 2020
మనామా:ఇల్గీల్ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ప్రభుత్వ పాలసీపై పార్లమెంటరీ డిబేట్ కోసం బహ్రెయినీ లా మేకర్స్ అభ్యర్థన పెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యమైనదని సంబంధిత లా మేకర్స్ చెబుతున్నారు. దేశంలో సుమారుగా 50,000 నుంచి 55,000 మంది ఇల్లీగల్ వర్కర్స్ వున్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తాజా అంచనాలు చెబుతున్నాయి. వర్క్ ఫోర్స్లో సిటిజన్స్కే అధిక ప్రాధాన్యతనిచ్చేలా డ్రాఫ్ట్ బిల్ని బహ్రెయినీ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే అప్రూవ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఎంప్లాయర్స్, బహ్రెయినీ జాబ్ సీకర్స్ రికార్డులను చూసి, క్వాలిఫైడ్ పౌరులకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఈ నిబంధనలని పాటించకపోతే 5,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమాన విధించడం జరుగుతుంది. బహ్రెయిన్లో విదేశీ కార్మికుల సంఖ్య 2019లో 477,741 వుంటే, ప్రస్తుతం అది 456,840కి తగ్గింది. బహ్రెయిన్ జనాభలో సగానికిపైగా ప్రవాసీయులు వున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







