ఇల్లీగల్స్పై పాలసీకి సంబంధించి చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్
- November 09, 2020
మనామా:ఇల్గీల్ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ప్రభుత్వ పాలసీపై పార్లమెంటరీ డిబేట్ కోసం బహ్రెయినీ లా మేకర్స్ అభ్యర్థన పెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యమైనదని సంబంధిత లా మేకర్స్ చెబుతున్నారు. దేశంలో సుమారుగా 50,000 నుంచి 55,000 మంది ఇల్లీగల్ వర్కర్స్ వున్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తాజా అంచనాలు చెబుతున్నాయి. వర్క్ ఫోర్స్లో సిటిజన్స్కే అధిక ప్రాధాన్యతనిచ్చేలా డ్రాఫ్ట్ బిల్ని బహ్రెయినీ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే అప్రూవ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఎంప్లాయర్స్, బహ్రెయినీ జాబ్ సీకర్స్ రికార్డులను చూసి, క్వాలిఫైడ్ పౌరులకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఈ నిబంధనలని పాటించకపోతే 5,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమాన విధించడం జరుగుతుంది. బహ్రెయిన్లో విదేశీ కార్మికుల సంఖ్య 2019లో 477,741 వుంటే, ప్రస్తుతం అది 456,840కి తగ్గింది. బహ్రెయిన్ జనాభలో సగానికిపైగా ప్రవాసీయులు వున్నారు.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









