45 కిలోల డ్రగ్స్ అమ్మకం: ముగ్గురి అరెస్ట్
- November 10, 2020
యూఏఈ: 45 కిలోల హెరాయిన్, క్రిస్టల్ మెత్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు సభ్యుల గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. వారి వారి నుంచి మాదక ద్రవ్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ వివరాల్ని వెల్లడించారు. ముఠా సభ్యులు అబుధాబి, దుబాయ్ మరియు షార్జాల్లో మాదక ద్రవ్యాల్ని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ సుహైల్ అల్ రాష్ది మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అబుధాబి పోలీస్ - యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ఈ తరహా కేసుల్ని డీల్ చేస్తోందని చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ కల్నల్ తాహెర్ ఘారిబ్ అల్ దహెరి మాట్లాడుతూ, క్రిమినల్ గ్యాంగుల్నీ, ఇల్లీగల్ డ్రగ్స్ విక్రయదారుల్నీ పట్టుకోవడంలో పోలీసులు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









