బ్యాటరీ మార్చుతుండగా బోటులో అగ్ని ప్రమాదం

- November 10, 2020 , by Maagulf
బ్యాటరీ మార్చుతుండగా బోటులో అగ్ని ప్రమాదం

రస్‌ అల్‌ ఖైమా: ఇద్దరు భారతీయ ఫిషర్‌మెన్‌ తీవ్రంగా గాయపడిన ఘటన రస్‌ అల్‌ ఖైమాలోని గలెలియా పోర్ట్‌ వద్ద జరిగింది. ఫిషింగ్‌ బోటులో అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో వున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఫిషర్‌మెన్‌కి ఓ మోస్తరు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ అల్‌ మెహబూబి మాట్లాడుతూ, గాయాలతో ఆసుపత్రిలో చేరినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని అన్నారు. రస్‌ అల్‌ ఖైమా ఫిషర్‌మెన్‌ అసోసియేషన్‌ హెడ్‌ ఖలీఫా అల్‌ ముహైరి మాట్లాడుతూ, బ్యాటరీని మార్చే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెప్పారని, ఈ మేరకు అసోసియేషన్‌కి సమాచారం ఇచ్చారని తెలిపారు. రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌తో ఈ తరహా ప్రమాదాల్ని నివారించవచ్చునని ఆయన చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com