కోవిడ్ వ్యాక్సిన్ కోసం అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ తో కువైట్ ఒప్పందం
- November 10, 2020కువైట్ సిటీ:కువైట్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను యుద్ధప్రాతిపదికన అందించేందుకు తాము ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తో ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఫైజర్..జర్మన్ బయోటెక్ కంపెనీ బయోన్టెక్ తో కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశలో ఉంది. అయితే...తమ మూడో దశ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని, 90 శాతానికిపైగా ప్రభావంతంగా ఫలితాలు చూపిస్తున్నాయని..ఫైజర్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు..వ్యాక్సిన్ పనితీరుపై ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీతో చేయించిన మధ్యంతర విశ్లేషణ నివేదికకు సంబంధించి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు సమాచారం కూడా పంపింది. అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ కు అధికారిక అనుమతి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే..వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రాగానే కువైట్ కు కూడా ప్రధాన్యత ఇస్తూ పది లక్షల డోసులు అందించాలని ప్రభుత్వం ఫైజర్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 7.6 బిలియన్ దినార్లని స్పష్టం చేసింది. తాము కువైటీయన్ల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, దేశంలోని ప్రజలకు సెగ్మెంట్లుగా విభజించి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించింది. ఒకవేళ వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలోనే దిగుమతి అయితే..ముందుగా వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, ఆస్పత్రి సిబ్బందితో పాటు ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి ప్రధాన్యత క్రమంలో వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ సరిపడినంతగా దిగుమతి అయితే...దేశంలోని పౌరులు, ప్రవాసీయులు అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు