ఒడిశాలో మరోసారి పృథ్వీ-2 క్షిపణి పరీక్ష
- February 16, 2016
ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్రేంజ్ పరిధిలో డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండో అధికారులు మంగళవారం పృథ్వీ-2 పరీక్ష నిర్వహించారు. పృథ్వీ-2 క్షిపణిని పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచారు. 350 కిలోమీటర్ల పరిధిలో 500-1000 కిలోల బరువు గల వార్హెడ్స్ను మోసుకుపోవడం ఈ క్షిపణి ప్రత్యేకత. సైన్యం యూజర్ ట్రయల్లో భాగంగా దీన్ని ఈరోజు మరోసారి పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి అధునాతనమైన వ్యవస్థతో నిర్దేశిత లక్ష్యం కదలికలను బట్టి తన దిశను సొంతంగా మార్చుకోగలదు. క్షిపణి దిశను అధికారులు ఒడిశాలోని డీఆర్డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ, టెలీమెట్రీ స్టేషన్ల ద్వారా పరీక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







