ప్రిన్స్‌ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోడీ సంతాపం

- November 12, 2020 , by Maagulf
ప్రిన్స్‌ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోడీ సంతాపం

బహ్రెయిన్‌ ప్రధాని ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్‌ కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా అలాగే బహ్రెయిన్‌ ప్రజల్ని ఉద్దేశించి సంతాప ప్రకటన చేశారు. బహ్రెయిన్‌ కింగ్‌ అలాగే రాయల్‌ ఫ్యామిలీ, బహ్రెయిన్‌ ప్రజలు ధైర్యంగా వుండాలని, ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com