దివాళి సెలబ్రేషన్స్ - కోవిడ్19 సేఫ్టీ గైడ్లైన్స్
- November 13, 2020దుబాయ్:కరోనా నేపథ్యంలో దివాళి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ అథారిటీస్ సూచిస్తున్నాయి. రిటెయిల్ ఆర్గనైజేషన్, రిటెయిల్ మరియు స్ట్రాటిజిక్ అలయన్సెస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫెరాస్ అరాకత్ మాట్లాడుతూ, దుబాయ్లో వివిధ మతాలు, జాతులకు చెందిన సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయనీ, అయితే దీపావళి సందర్భంగా ఈసారి కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గైడ్లైన్స్కి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. షాపింగ్ సహా ఆయా ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, మాస్క్లు ప్రతి ఒక్కరూ ధరించాలనీ, శానిటైజేషన్ ఎప్పటికప్పుడు జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.దివాళి సందర్భంగా ప్రత్యేక రిటెయిల్ డీల్స్ వుంటాయనీ, ఈసారీ అవి కొనసాగుతాయనీ, సంబరాలు ఎలాంటి సమస్యలకూ దారి తీయకుండా జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారాయన.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం