కరోనా వ్యాక్సిన్‌ వచ్చేదాకా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలే

- November 13, 2020 , by Maagulf
కరోనా వ్యాక్సిన్‌ వచ్చేదాకా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలే

కువైట్ సిటీ:కువైట్‌ హెల్త్‌ అథారిటీస్‌, విద్యార్థుల పరీక్షల విషయమై ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ రిక్వెస్త్‌ని తిరస్కరించడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ప్రత్యక్ష విధానంలో కష్టమని హెల్త్‌ అథారిటీస్‌ వెల్లడించాయి. విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పరీక్షల్ని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించడమే మేలని సూచించింది. హెల్త్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ ముస్తఫా రెడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫైజర్‌ అలాగే బయో టెక్నాలజీ సంస్థ బయో ఎన్‌ టెక్‌ - కోవిడ్‌ వ్యాక్సిన్‌ 90 శాతం పనిచేస్తోందంటూ ప్రకటన చేసిన దరిమిలా, కువైట్‌ మినిస్ట్రీ 1 మిలియన్‌ డోసులను ఆర్డర్‌ చేయడం జరిగింది. కాగా, కువైట్‌లో ఇప్పటిదాకా 134,932 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 830 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com