పౌరులు, రెసిడెంట్స్‌ కోసం తెరచుకున్న సరిహద్దులు

- November 13, 2020 , by Maagulf
పౌరులు, రెసిడెంట్స్‌ కోసం తెరచుకున్న సరిహద్దులు

మస్కట్‌: సరిహద్దుల్లోని దేశాలతో వున్న బోర్డర్స్‌, ఒమనీ రెసిడెంట్స్‌ అలాగే, ఒమనీయుల కోసం తెరచి వున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని నిబంధనల మేరకు సరిహద్దుల్లోంచి ఒమనీయులు, ఒమన్‌ రెసిడెంట్స్‌ వచ్చి, వెళ్ళేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చెల్లుబాటయ్యే రెసిడెన్స్‌ వీసా వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి ప్రవేశం కల్పిస్తారు. అలా వచ్చేవారికి పీసీఆర్‌ కరోనా వైరస్‌ టెస్ట్‌ తప్పనిసరి. 90 గంటల ముందుగా ఈ పరీక్ష చేయించుకుని వుండాలి. సుల్తానేట్‌లో జరిగే టెస్ట్‌ చేయించుకోవాల్సి వుంటుంది. ఏడు రోజుల క్వారంటైన్‌ కూడా పాటించాల్సి వుంటుంది. ఎనిమిదవ రోజు పీసీఆర్‌ టెస్ట్‌ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com