సంజూ భాయ్తో కలిసి దీపావళి సంబరాలు...
- November 15, 2020
మున్నాభాయ్ సంజయ్ దత్ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడ్డ సంగతి తెలిసిందే. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు క్యాన్సర్ని జయించానని పొడవైన పోస్ట్ పెట్టి అభిమానులని ఆనందింపజేశాడు. తమ అభిమాన నటుడు క్యాన్సర్ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. ఇక దీపావళి రోజు సంజయ్ దత్ తన భర్య మాన్యతా దత్తో కలిసి దుబాయ్ లో దీవాళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
సంజయ్ ఇంట్లో జరిగిన దీవాళి వేడుకలలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా భాగం అయ్యారు. సంప్రదాయమైన దుస్తులలో మెరిసిన వీరిని చూసి అభిమానులు తెగ సంతోషించారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్లాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'సంజయ్, మాన్యతా నా స్నేహితులు' అని కాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







