దుబాయ్ రైడ్ కు అంతా రెడీ..రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
- November 19, 2020
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా దుబాయ్ మరో ఈవెంట్ సిద్ధమైంది. రేపు(శుక్రవారం) నిర్వహించబోయే దుబాయ్ రైడ్ సైక్లింగ్ ను సజావుగా నిర్వహించేందుకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. సైకిల్ రైడింగ్ జరిగే రహదారుల్లో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వాహనదారులకు సూచించింది. సైకిల్ రైడింగ్ కొనసాగే షేక్ జాయెద్ రోడ్ మూసివేయనున్నట్లు తెలిపిన ఆర్టీఏ..వాహనదారులు అల్ ఖైల్ రోడ్డును ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే లోయర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్డును మూసి ప్రత్యామ్నాయంగా అప్పర్ ఫైనాన్సియల్ రోడ్డును అందుబాటులో తీసుకురానున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులోనూ వాహనాలను అనుమతించరు..అందుకు ప్రత్యామ్నాయంగా బుర్జ్ ఖలీఫా రోడ్ ను వాహనదారులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ రైడ్ లో పాల్గొనే వారి కోసం అప్పర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ద్వారా దుబాయ్ మాల్, జబీల్ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేసుకోవచ్చు. ముష్తాక్బాల్, జబీల్ 2 స్ట్రీట్స్ ద్వారా వచ్చే వాహనాలకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









