ఉగ్రవాద వెబ్ సైట్లు, ప్రమోషన్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సౌదీ
- November 19, 2020
సౌదీ: కింగ్డమ్ పరిధిలో ఎవరైనా ఉగ్రవాద సంస్థలకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సౌదీ ప్రాసిక్యూటర్స్. ఉగ్రవాద సంస్థలతో నిషేధిత గ్రూపులతో ఎలాంటి సంబంధాలు ఏర్పర్చుకున్న శిక్షార్హులు అవుతారని వెల్లడించింది. అలాంటి వారికి నేరం రుజువు అయితే పదేళ్ల జైలు శిక్ష 5 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కింగ్డమ్ పరిధిలోని ప్రజలు ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వెబ్ సైట్ లను నిర్వహించటం, ఉగ్రవాద భావజాలన్ని ప్రచారం చేయటం నేరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఉగ్రవాద సంస్థలు, నిషేధిత గ్రూపులతోగానీ, ఆయా సంస్థల సభ్యులతో గానీ కాంటాక్ట్ లో ఉండటం, వారికి ఫైనాన్సింగ్ చేయటం, పేలుడు పదార్ధాల తయారీ వీడియోలనూ పబ్లిష్ చేయటం, ఉగ్రవాదుల భావజాలాన్ని ప్రచారం చేయటంతో పాటు టెర్రరిస్టు గ్రూపులకు సహాయం చేసే ప్రతి చర్యపై నిషేధం ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఇటీవలె జెడ్డాలో చోటు చేసుకున్న బాంబు దాడిలో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు తామే కారణమంటూ డేష్ గ్రూపు ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సౌదీ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?









