ఉగ్రవాద వెబ్ సైట్లు, ప్రమోషన్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సౌదీ
- November 19, 2020
సౌదీ: కింగ్డమ్ పరిధిలో ఎవరైనా ఉగ్రవాద సంస్థలకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సౌదీ ప్రాసిక్యూటర్స్. ఉగ్రవాద సంస్థలతో నిషేధిత గ్రూపులతో ఎలాంటి సంబంధాలు ఏర్పర్చుకున్న శిక్షార్హులు అవుతారని వెల్లడించింది. అలాంటి వారికి నేరం రుజువు అయితే పదేళ్ల జైలు శిక్ష 5 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కింగ్డమ్ పరిధిలోని ప్రజలు ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వెబ్ సైట్ లను నిర్వహించటం, ఉగ్రవాద భావజాలన్ని ప్రచారం చేయటం నేరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఉగ్రవాద సంస్థలు, నిషేధిత గ్రూపులతోగానీ, ఆయా సంస్థల సభ్యులతో గానీ కాంటాక్ట్ లో ఉండటం, వారికి ఫైనాన్సింగ్ చేయటం, పేలుడు పదార్ధాల తయారీ వీడియోలనూ పబ్లిష్ చేయటం, ఉగ్రవాదుల భావజాలాన్ని ప్రచారం చేయటంతో పాటు టెర్రరిస్టు గ్రూపులకు సహాయం చేసే ప్రతి చర్యపై నిషేధం ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఇటీవలె జెడ్డాలో చోటు చేసుకున్న బాంబు దాడిలో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు తామే కారణమంటూ డేష్ గ్రూపు ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సౌదీ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







