147,000 రెసిడెన్సీ వీసాలకు ముగిసిన గడువు

- November 19, 2020 , by Maagulf
147,000 రెసిడెన్సీ వీసాలకు ముగిసిన గడువు

కువైట్: కరోనా నేపథ్యంలో తలెత్తిన అనేక సమస్యల కారణంగా వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కువైట్‌ని విడిచి ఆయా కారణాలతో వలసదారులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తాజాగా వెల్లడయిన గణాంకాల ప్రకారం 147,000 మందికి పైగా వలసదారుల రెసిడెన్సీ వీసాల గడువు తీరింది. కరోనా వైరస్‌కి ముందు దేశంలో వలసదారుల సంఖ్య 3.3 మిలియన్లు కాగా, ఇప్పుడు అది 2,650,000కి చేరింది. చెల్లుబాటయ్యే వీసాలు కలిగి వేరే దేశాల్లో వుండిపోయిన వలసదారుల సంఖ్య 365,000 కాగా, గడువు తీరిన వీసాల సంఖ్య 147,000గా వుంది. కాగా, 34 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ కొనసాగుతోంది కరోనా నేపథ్యంలో. కాగా, రెసిడెన్సీ ఉల్లంఘనల విషయానికొస్తే 132,000 వలసదారులు ఈ లిస్ట్‌లో వున్నారు. మినిస్రీ& టాఫ్‌ ఇంటీరియర్‌ ఇచ్చిన అవకాశాన్ని (డిసెంబర్‌ వరకు గడువు పొడిగింపు) 40,000 మందికి పైగా వినియోగించుకోనున్నారు. కాగా కార్మికులు అలాగే స్పాన్సర్స్‌ మధ్య వివాదాల పరిష్కారం కోసం ఓ మెకానిజంని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అలాగే పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ ఏర్పాటు చేయనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com