147,000 రెసిడెన్సీ వీసాలకు ముగిసిన గడువు
- November 19, 2020
కువైట్: కరోనా నేపథ్యంలో తలెత్తిన అనేక సమస్యల కారణంగా వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కువైట్ని విడిచి ఆయా కారణాలతో వలసదారులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తాజాగా వెల్లడయిన గణాంకాల ప్రకారం 147,000 మందికి పైగా వలసదారుల రెసిడెన్సీ వీసాల గడువు తీరింది. కరోనా వైరస్కి ముందు దేశంలో వలసదారుల సంఖ్య 3.3 మిలియన్లు కాగా, ఇప్పుడు అది 2,650,000కి చేరింది. చెల్లుబాటయ్యే వీసాలు కలిగి వేరే దేశాల్లో వుండిపోయిన వలసదారుల సంఖ్య 365,000 కాగా, గడువు తీరిన వీసాల సంఖ్య 147,000గా వుంది. కాగా, 34 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కొనసాగుతోంది కరోనా నేపథ్యంలో. కాగా, రెసిడెన్సీ ఉల్లంఘనల విషయానికొస్తే 132,000 వలసదారులు ఈ లిస్ట్లో వున్నారు. మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్ ఇచ్చిన అవకాశాన్ని (డిసెంబర్ వరకు గడువు పొడిగింపు) 40,000 మందికి పైగా వినియోగించుకోనున్నారు. కాగా కార్మికులు అలాగే స్పాన్సర్స్ మధ్య వివాదాల పరిష్కారం కోసం ఓ మెకానిజంని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఏర్పాటు చేయనున్నాయి.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









