బహ్రెయిన్:అక్రమంగా పోగాకు ఉత్పత్తుల తరలింపు, అమ్మకాల కేసులో 9 మంది అరెస్ట్
- November 20, 2020
మనామా:నిషేధిత పోగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలించటం, పోగాకు ఉత్పత్తులను అమ్ముతున్న కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మనామా గవర్నరేట్ పోలీస్ డీజీ తెలిపిన వివరాల ప్రకారం తొమ్మిది మంది సభ్యులు ఉన్న ముఠా బహ్రెయిన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిషేధిత ఉత్పత్తులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ తొమ్మిది మంది ముఠాలో మొత్తం గ్యాంగ్ ను ఒకరు ఆర్గనైజ్ చేస్తుండగా...మరొకరు నిషేధిత ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తుంటారని వివరించారు. గల్ఫ్ దేశాల్లోని మరో దేశంలో ఉన్న మూడో వ్యక్తి ద్వారా సరుకును అందుకుంటన్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి మొత్తం BD3,50,000 విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









