నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- February 18, 2026
మనామా: 2023 ప్రారంభం నుండి 2025 చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాన్ బహ్రెయిన్ పేషంట్ల నుండి BD3.98 మిలియన్లకు పైగా ఫీజులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వసూలు చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించారు. ఎంపీ మహమూద్ ఫర్దాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 343,262 మందికి పైగా నాన్ బహ్రెయిన్ పేషంట్లు ఫీజు మినహాయింపు నిర్ణయం పరిధిలోకి రారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 67,028 నాన్ బహ్రెయిన్లు సందర్శించారని, ప్రభుత్వ ఆసుపత్రులలో 47,105 మంది ఇన్పేషెంట్లుగా చేరారని మంత్రిత్వ శాఖ నివేదించింది. అదే సమయంలో చట్టపరమైన నిబంధనల కింద అర్హులైన వారికి మానవతా సహాయం కింద మినహాయింపులు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









