స్వదేశీ కార్మికుల కనీస వేతనాలను సవరించిన సౌదీ ప్రభుత్వం
- November 20, 2020
రియాద్:సౌదీ పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందే దిశగా సౌదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో పని చేస్తున్న స్వదేశీ కార్మికుల కనీస వేతనాన్ని 4000 రియాల్స్ కు పెంచుతూ సవరణలు చేసింది. నితాఖాత్ ప్రొగ్రామ్ లో భాగంగా సౌదీయుల్లో నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకు ఈ సవరణలు దోహదం చేస్తాయని మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో సౌదీ సంస్థల్లో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు అవుతాయని అభిప్రాయపడింది. అయితే..ఈ పెంచిన కనీస వేతనాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో మాత్రం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలాఉంటే..పెంచిన వ్యాట్ పై కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత సమీక్షిస్తామని వాణిజ్య, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5 శాతంగా ఉన్న వ్యాట్ ను గత జులైలో 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







