దుబాయ్: మిర్దిఫ్ సిటీ సెంటర్లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న రహదారులు

- November 20, 2020 , by Maagulf
దుబాయ్: మిర్దిఫ్ సిటీ సెంటర్లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న రహదారులు

దుబాయ్-షార్జా మధ్య రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. ఈ రెండు నగరాల మధ్య మిర్దిఫ్ సిటీ సెంటర్ లోని షేక్ మహమ్మద్ బిన్ జయాద్ రహదారిలో, అల్ రిబత్ ఇంటర్ సెక్షన్ దగ్గర  రహదారులను విస్తరించటంతో అవసరమైన చోట ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది దుబాయ్ ఆర్టీఏ. ఈ అభివృద్ధి చేసిన రహదారులు నేటి నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి.  అల్ రిబత్, ట్రిపోలీ రహదారిలో మరో లేన్ ను నూతనంగా నిర్మించగా..ఇప్పటికే ఉన్న వంతెనను విస్తరించారు. దీంతో దుబాయ్, షార్జా మధ్య ట్రాఫిక్ ఫ్లో మరింత మెరుగవనుంది. ఇక ట్రిపోలీ స్ట్రీట్ కూడలి, షేక్ జయాద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ రోడ్డు నుంచి ఎమిరాతి రహదారి వరకు రహదారిని విస్తరిస్తూ చేపట్టిన కొత్త రోడ్డు పనులను కూడా ఆర్టీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ కొత్త రోడ్డు 5.3 కిలోమీటర్ల మేర, రెండు దిశల్లో మూడు లేన్లు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com