దుబాయ్: మిర్దిఫ్ సిటీ సెంటర్లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న రహదారులు
- November 20, 2020
దుబాయ్-షార్జా మధ్య రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. ఈ రెండు నగరాల మధ్య మిర్దిఫ్ సిటీ సెంటర్ లోని షేక్ మహమ్మద్ బిన్ జయాద్ రహదారిలో, అల్ రిబత్ ఇంటర్ సెక్షన్ దగ్గర రహదారులను విస్తరించటంతో అవసరమైన చోట ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది దుబాయ్ ఆర్టీఏ. ఈ అభివృద్ధి చేసిన రహదారులు నేటి నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. అల్ రిబత్, ట్రిపోలీ రహదారిలో మరో లేన్ ను నూతనంగా నిర్మించగా..ఇప్పటికే ఉన్న వంతెనను విస్తరించారు. దీంతో దుబాయ్, షార్జా మధ్య ట్రాఫిక్ ఫ్లో మరింత మెరుగవనుంది. ఇక ట్రిపోలీ స్ట్రీట్ కూడలి, షేక్ జయాద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ రోడ్డు నుంచి ఎమిరాతి రహదారి వరకు రహదారిని విస్తరిస్తూ చేపట్టిన కొత్త రోడ్డు పనులను కూడా ఆర్టీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ కొత్త రోడ్డు 5.3 కిలోమీటర్ల మేర, రెండు దిశల్లో మూడు లేన్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం









