దుబాయ్: మిర్దిఫ్ సిటీ సెంటర్లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న రహదారులు
- November 20, 2020
దుబాయ్-షార్జా మధ్య రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. ఈ రెండు నగరాల మధ్య మిర్దిఫ్ సిటీ సెంటర్ లోని షేక్ మహమ్మద్ బిన్ జయాద్ రహదారిలో, అల్ రిబత్ ఇంటర్ సెక్షన్ దగ్గర రహదారులను విస్తరించటంతో అవసరమైన చోట ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది దుబాయ్ ఆర్టీఏ. ఈ అభివృద్ధి చేసిన రహదారులు నేటి నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. అల్ రిబత్, ట్రిపోలీ రహదారిలో మరో లేన్ ను నూతనంగా నిర్మించగా..ఇప్పటికే ఉన్న వంతెనను విస్తరించారు. దీంతో దుబాయ్, షార్జా మధ్య ట్రాఫిక్ ఫ్లో మరింత మెరుగవనుంది. ఇక ట్రిపోలీ స్ట్రీట్ కూడలి, షేక్ జయాద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ రోడ్డు నుంచి ఎమిరాతి రహదారి వరకు రహదారిని విస్తరిస్తూ చేపట్టిన కొత్త రోడ్డు పనులను కూడా ఆర్టీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ కొత్త రోడ్డు 5.3 కిలోమీటర్ల మేర, రెండు దిశల్లో మూడు లేన్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు