ఢిల్లీలో కాలుష్యం..సోనియాకు వైద్య నిపుణుల సలహా
- November 20, 2020
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొంతకాలంగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిపోయింది. దీంతో స్థానికులు శ్వాసకోశ, గొంతు సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా సైతం కొద్ది రోజుల పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారని పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్లతారని, కొంతకాలం అక్కడే ఉంటారని వెల్లడించాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా వెళ్లనున్నారని సమాచారం.
కాగా, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా జూలై 30న ఆమె గంగారాం హాస్పిటల్ లో చికిత్సను కూడా పొందారు. ఆపై సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించుకుని వచ్చారు. ఇక ఢిల్లీలో పెరిగిన కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి ఉబ్బసం సోకే అవకాశాలు అధికమని, ఆపై ఛాతీ నొప్పి తీవ్రతరం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు