10 లక్షల డోసులు ఆర్డర్ ఇచ్చిన బహ్రెయిన్
- November 20, 2020
మనామా:ఇంకా తుది అనుమతులు కూడా రాక ముందే కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ కు డిమాండ్ అమాంతంగా పెరుగుతోంది. జర్మనీకి చెందిన బయోటెక్ కంపెనీ బయోన్ టెక్ తో కలిసి తయారు చేసిన ఫైజర్...క్లినికల్ ట్రయల్స్ లో 90 శాతం సత్ఫలితాలు ఇచ్చినట్లు ఆ కంపెనీదారులు ఇటీవలె ప్రకటించారు. అయితే..అప్పటికే కువైట్ ప్రభుత్వం పది లక్షల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. బహ్రెయిన్ కూడా పది లక్షల డోసులు కావాలని గత ఆగస్టులోనే ఫైజర్ కు ఆర్డర్ ఇచ్చింది. అయితే..మరో విశేషం ఏమిటంటే..బహ్రెయిన్ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ ను తమ దేశంలో ప్రయోగాత్మకంగా ప్రయోగించేందుకు ఒప్పుకుంది. యూఏఈతో కలిసి సంయుక్తంగా సినోఫార్మ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతించింది. అయితే..వ్యాక్సిన్ రేసులో ఫైజర్ ముందు వరసలో ఉండటంతో ఆ కంపెనీకి మిలియన్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దేశ ప్రజల ఆరోగ్యభద్రతకు ఏది శ్రేయస్కరమో..కోవిడ్ 19 నియంత్రణ జాతీయ టాస్క్ ఫోర్స్ కూడా అదే నిర్ణయాన్ని అనుసరిస్తుందని బహ్రెయిన్ స్పష్టం చేసింది. ఏ వ్యాక్సిన్ కొనుగోలుపై టాస్క్ ఫోర్స్ సూచనలు కీలకమని తెలిపింది. అయితే..ఇతర కంపెనీలకు తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చినా... ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ ఉత్తమ ఫలితాలు సాధిస్తుందో ఆ వ్యాక్సిన్ ను కొనుగోలు చేస్తామని కూడా బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి









