బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- February 15, 2026
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్పైకి ఎగిరి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.
ప్రమాదంలో మృతిచెందిన యువకుల వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి సహా ప్రయాణికులు మద్యం సేవించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









