బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి

- February 15, 2026 , by Maagulf
బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎగిరి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

ప్రమాదంలో మృతిచెందిన యువకుల వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి సహా ప్రయాణికులు మద్యం సేవించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com