యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- February 16, 2026
యూఏఈ: యూఏఈ రాయల్ ఫోటోగ్రాఫర్ గా పేరు గాంచిన రమేష్ శుక్లా(87) కన్నుమూశారు. 1971లో యూనియన్ హౌస్లో యూనియన్ ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో అనేక అరుదైన ఫోటోలను రమేష్ తన కెమెరాలో బంధించారు. రమేష్ శుక్లా గుండెపోటు కారణంగా మరణించారని అతని కుమారుడు నీల్ శుక్లా వెల్లడించారు. తన తండ్రి చివరి రోజుల్లో కూడా ఫోటోగ్రఫీ పట్ల చూపిన అంకితభావం తాను ఎన్నడూ మర్చిపోలేనని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తాము అతని సేకరణ నుండి వేలాది ఫోటోలను డాక్యుమెంట్ చేస్తున్నామని తెలిపాడు. యూఏఈకి సంబంధించి అనేక చారిత్రక ఘట్టాల ఫోటోలను బంధించిన రమేష్ శుక్లా.. రాయల్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపుపొందారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









