యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!

- February 16, 2026 , by Maagulf
యూఏఈ \'రాయల్ ఫోటోగ్రాఫర్\' రమేష్ శుక్లా కన్నుమూత..!!

యూఏఈ: యూఏఈ రాయల్ ఫోటోగ్రాఫర్ గా పేరు గాంచిన రమేష్ శుక్లా(87) కన్నుమూశారు. 1971లో యూనియన్ హౌస్‌లో యూనియన్ ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో అనేక అరుదైన ఫోటోలను రమేష్ తన కెమెరాలో బంధించారు.  రమేష్ శుక్లా గుండెపోటు కారణంగా మరణించారని అతని కుమారుడు నీల్ శుక్లా వెల్లడించారు. తన తండ్రి చివరి రోజుల్లో కూడా  ఫోటోగ్రఫీ పట్ల చూపిన అంకితభావం తాను ఎన్నడూ మర్చిపోలేనని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తాము అతని సేకరణ నుండి వేలాది ఫోటోలను డాక్యుమెంట్ చేస్తున్నామని తెలిపాడు.  యూఏఈకి సంబంధించి అనేక చారిత్రక ఘట్టాల ఫోటోలను బంధించిన రమేష్ శుక్లా.. రాయల్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపుపొందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com