కువైట్:ఇండియాతో సహా 34 దేశాలపై నిషేధం కొనసాగింపు..ఎన్నికల తర్వాతే నిర్ణయం
- November 22, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావిత దేశాలుగా పరిగణిస్తున్న 34 దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై కువైట్ ప్రభుత్వం నిషేధం యధావిధిగా కొనసాగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో భారత్ తో సహా నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి కువైట్ వెళ్లాలనుకునే ప్రవాసీయులు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి 34 దేశాలపై ఆంక్షలు పాక్షికంగా సడలించింది..పకడ్బందీ క్వారంటైన్ నిబంధనలతో డొమస్టిక్ వర్కర్లకు అనుమతించాలని ఇటీవలె కువైట్ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే..వచ్చే నెలలో కువైట్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంక్షల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ అధికారవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఎన్నికలు ముగిసన తర్వాతే ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, పిలిప్పైన్స్ తో పాటు మిగిలిన బ్యాన్డ్ కంట్రీస్ నుంచి ప్రవాసీయులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









