కువైట్:ఇండియాతో సహా 34 దేశాలపై నిషేధం కొనసాగింపు..ఎన్నికల తర్వాతే నిర్ణయం
- November 22, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావిత దేశాలుగా పరిగణిస్తున్న 34 దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై కువైట్ ప్రభుత్వం నిషేధం యధావిధిగా కొనసాగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో భారత్ తో సహా నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి కువైట్ వెళ్లాలనుకునే ప్రవాసీయులు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి 34 దేశాలపై ఆంక్షలు పాక్షికంగా సడలించింది..పకడ్బందీ క్వారంటైన్ నిబంధనలతో డొమస్టిక్ వర్కర్లకు అనుమతించాలని ఇటీవలె కువైట్ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే..వచ్చే నెలలో కువైట్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంక్షల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ అధికారవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఎన్నికలు ముగిసన తర్వాతే ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, పిలిప్పైన్స్ తో పాటు మిగిలిన బ్యాన్డ్ కంట్రీస్ నుంచి ప్రవాసీయులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









