తెలంగాణలో కొత్తగా 873 కరోనా కేసులు, 4 మరణాలు
- November 22, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఇందులో 11,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,50,453 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,296 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, నలుగురు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1430కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 41,646 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 51,34,335కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 58, జీహెచ్ఎంసీ 152, జగిత్యాల 36, జనగాం 8, జయశంకర్ భూపాలపల్లి 10, గద్వాల్ 4, కామారెడ్డి 11, కరీంనగర్ 44, ఖమ్మం 29, ఆసిఫాబాద్ 2, మహబూబ్ నగర్ 20, మహబూబాబాద్ 13, మంచిర్యాల 22, మెదక్ 10, మేడ్చల్ 78, ములుగు 18, నాగర్ కర్నూల్ 13, నల్గొండ 47, నారాయణపేట 2, నిర్మల్ 4, నిజామాబాద్ 13, పెద్దపల్లి 22, రాజన్న సిరిసిల్ల 18, రంగారెడ్డి 71, సంగారెడ్డి 27, సిద్ధిపేట 18, సూర్యాపేట 22, వికారాబాద్ 5, వనపర్తి 8, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 56, యదాద్రి భువనగిరిలో 14 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









